TDP: ఏపీ మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ పై దాడి !

-

 

నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది. ఏపీ మంత్రి ఫరూక్ కుమారుడు, టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ పై దాడి చోటు చేసుకుంది. టీడీపీ పార్టీ ఆఫిస్ రాజ్ థియేటర్ లో నుండి కారు లో ఫిరోజ్ వస్తుండగా నలుగురు ఆగంతకులు దాడి చేశారు. కారు అద్దాలను పగలగొట్టారు ఆగంతకులు. అప్రమత్తమై కారు దిగి నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించారు ఫిరోజ్.

Attack on AP Minister Farooq’s son, TDP District Secretary Feroze

కానీ ఆ ముగ్గురు నిందితులు పరారీ అయ్యారు. ఇందులో ఒక నిందితుని పట్టుకున్నారు ఫిరోజ్ అనుచరులు. అనంతరం అతన్ని కొట్టి.. పోలీసులు అప్పగించారు. ఈ సంఘటనపై విచారిస్తున్నారు పోలీసులు. నిందితుడు నూనెపల్లెకు చెందిన డ్రైవర్ మణికంఠ రెడ్డి గా గుర్తించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version