జగన్ ఎప్పుడు జైలుకెళ్తాడా అని మంత్రులు ఎదురు చూస్తున్నారు -బుద్దా వెంకన్న

-

వివేకా కేసుపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో సీఎం జగన్ ఎప్పుడు జైలుకెళ్తాడా అని మంత్రులు సైతం ఎదురు చూస్తున్నారన్నారు. అందుకే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారని.. తల్లీ, చెల్లిని జగన్ తన అవసరానికి వాడుకుని వదిలేశాడని తెలిపారు.

అసెంబ్లీలో విజయమ్మను అవమానించిన బొత్సను అందలమెక్కించాడని వెల్లడించారు. గతంలో షర్మిల అరెస్టైనప్పుడు ప్రధాని మోడీ సైతం ఖండించినా, జగన్ కనీసం పరామర్శించ లేదన్నారు. అన్న వదిలిన బాణం జైల్లో ఉంటే కనీసం పరామర్శించ లేదని ఫైర్‌ అయ్యారు. మరో చెల్లలైన సునీతపై వైసీపీ శ్రేణులు అసభ్య పోస్టులు పెడుతున్నా జగన్ ఎందుకు ఖండించట్లేదు..? అని నిలదీశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఐడీలా సీబీఐ కూడా జగన్ చేతుల్లో ఉంటే ఈపాటికి వివేకా కూతురు, అల్లుడిని ఈపాటికి జైల్లో పెట్టించేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version