‘తల్లికి వందనం’ పేరిట సైబర్ మోసాలు…ఇవి క్లిక్ చేస్తే !

-

ఏపీ వాసులకు బిగ్ అలర్ట్. ‘తల్లికి వందనం’ పథకం పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్తగా మోసాలకు ప్లాన్ చేస్తున్నారు. తల్లికి వందనం పథకానికి ఎంపికైన లబ్ధిదారుల ఖాతాలు హోల్డ్ లో ఉన్నాయని వారిని నమ్మించి డబ్బులను కాజేస్తున్నారు. విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలలో ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులు మోసపోయారు. ఏపీ సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ కొందరి సమాచారాలు సేకరించి ఇలా మోసాలు చేస్తున్నారు.

Chandrababu Govt Scam EXPOSED in Thalliki Vandanam Scheme
Chandrababu Govt Scam EXPOSED in Thalliki Vandanam Scheme

ఇలా ఎవరైనా ఫోన్ చేసి మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఎవరైనా ఫోన్ చేసినట్లయితే వారిని నమ్మి ఎలాంటి సమాచారాలు చెప్పి మోసపోవద్దని చెబుతున్నారు. ఈ మోసాలపై ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఏపీ పోలీసులు సూచిస్తున్నారు. అనుమానస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీలోని వాసులు ఎవరికి సమాచారం చెప్పకపోవడమే మంచిదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news