BREAKING:కుప్పంలో 1,549 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు

-

BREAKING: కుప్పంలో ఆధిక్యంలో చంద్రబాబు ఉన్నారు. నారా చంద్రబాబుకు పోస్టుల్‌ బ్యాలెట్ ఓట్లు విపరీతంగా పడ్డాయి. దీంతో కుప్పంలో 1,549 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు ఉన్నారు. కాగా…అటు ఏపీలో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు.

అటు అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి కాగా… 8 గంటలకు లెక్కింపు ప్రారంభం అయింది. పార్లమెంట్ నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు ఏర్పాటు చేశారు. 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2446 ఈవీఎం టేబుళ్లు ఏర్పాటు చేశారు.557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version