RTC ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఆ ఖర్చులు పెంపు.. !

-

ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త అందజేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆర్టీసీ ఉద్యోగులు మరణించినట్లయితే వారి కుటుంబాలకు ఇచ్చే అంత్యక్రియ ఖర్చులను మరింతగా పెంచారు. ఈ ఖర్చులను రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు మరణించినట్లయితే వారి కుటుంబానికి 25 వేల రూపాయల వరకు డబ్బులను అందిస్తామని స్పష్టం చేశారు.

APSRTC
APSRTC

దీంతో ఆర్టీసీ ఉద్యోగుల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎరువుల అమ్మకాలలో అక్రమాలు జరిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మామిడి గుజ్జు అమ్మకాలకు మరో కమిటీని ఏర్పాటు చేసింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ఏపీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారు. రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news