ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు – చంద్రబాబు

-

ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రథమ భారతీయ భాషా శాస్త్రవేత్త, తెలుగు వెలుగు గిడుగు వేంకట రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని..ఈ వేళ… ప్రపంచ వ్యాప్త తెలుగువారందరికీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.


తెలుగు వ్యవహారిక భాషలోనే పుస్తక రచన చేయాలని ఉద్యమించి, సాహిత్యాన్ని సామాన్యుడికి చేరువ చేసిన గిడుగు రామ్మూర్తి స్మృతికి నివాళులర్పిస్తున్నానునన్నారు. విద్యావ్యాప్తి జరగాలంటే బోధన జరిగే భాష మాతృభాషే అయి వుండాలని ఆయన ఆశించారని… గిడుగు వారి ఆశయ స్ఫూర్తిగా.. తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం దగ్గర నుంచి, పాలనలో తెలుగును ప్రవేశపెట్టడం వరకు తెలుగు భాష వ్యాప్తికి, సంరక్షణకు నడుం కట్టింది తెలుగుదేశమేనని పేర్కొన్నారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా పాటుపడాలని కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version