చంద్రబాబు సంపద సృష్టి.. అందుకే వాటికి లైసెన్స్ : విజయసాయి రెడ్డి

-

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు సంపద సృష్టిలో భాగంగా గ్రామాల్లో బెల్ట్ షాపులకు లైసెన్స్ ఇచ్చేస్తున్నారని ఆరోపించారు. దీనికోసం టీడీపీ సిండికేట్ వ్యాపారులు జనాభా ప్రాతిపదికన ధర నిర్ణయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి స్పందించారు. ముఖ్యంగా అధిక మొత్తం వెచ్చించి మద్యం దుకాణాలను దక్కించుకున్న టీడీపీ సిండికేట్ వ్యాపారులు గ్రామాల్లో బెల్ట్ షాపులు లైసెన్స్ ఇచ్చేస్తున్నారు. బెల్ట్ షాపులు కోసం జనాభా.. మద్యం విక్రయాల స్థాయిని బట్టి రెండు లక్షల వరకు బెల్ట్ షాపులు లైసెన్స్ ఇచ్చేస్తున్నారు.

బెల్ట్ షాపుల్లో స్థానిక టీడీపీ నాయకులే మొత్తం ప్రక్రియల్లో చక్రం తిప్పుతున్నారు. ఎక్సైజ్ అధికారులు అటు వైపు చూడకుండా దరిదాపుల్లో మరో బెల్ట్ షాపు ఏర్పడకుండా సిండికేట్ వ్యాపారులే అన్నీ చూసుకుంటున్నారు. అందుకే టీడీపీ ప్రభుత్వాన్ని దొంగ ప్రభుత్వం.. దోపిడీ ప్రభుత్వమని ఘాటైన విమర్శలు చేశారు విజయ సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version