ఏపీ ఉద్యోగులకు శుభవార్త…బదిలీలపై మరో 15 రోజుల గడువు పొడిగింపు !

-

ఏపీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు సర్కార్‌. ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మరో 15 రోజుల గడువు పొడిగిస్తూ ప్రకటన చేసింది చంద్రబాబు సర్కార్‌. ఇక వచ్చే నెల 15వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేత ఉండనుందన్న మాట. అయితే… వచ్చే నెల 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్‌.

Chandrababu Sarkar has announced an extension of another 15 days for the transfer of employees

ఇప్పటికీ బదిలీల విధివిధానాలను రూపొందించుకోలేదు ఏపీలోని మెజార్టీ శాఖలు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, ఆర్ అండ్ బి, రవాణ శాఖల బదిలీల్లో తీవ్ర గందరగోళం నెలకొందని సమాచారం. విధి విధానాల రూపకల్పలోనే ఇబ్బందులు పడుతున్నాయి వివిధ శాఖలు. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మరో 15 రోజుల గడువు పొడిగిస్తూ ప్రకటన చేసింది చంద్రబాబు సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version