ఏపీ విద్యార్థులకు అలర్ట్.. ఆ పరీక్షల సమయంలో మార్పులు

-

ఏపీ విద్యార్థులకు అలర్ట్.. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్-2 పరీక్షల సమయంలో మార్పులు జరిగాయి. ఒంటిపూట బడుల కారణంగా ఏప్రిల్ 20, 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో జరిగే పరీక్షలను అన్ని క్లాసులకు ఉదయమే నిర్వహించనున్నారు.

ఒకటి ఎనిమిదవ తరగతి వరకు ఉదయం 9-12 వరకు, 9వ తరగతికి ఉదయం 9 నుంచి మ. 12:15 వరకు నిర్వహిస్తారు. టెన్త్ పరీక్షల మాదిరిగానే 9వ తరగతి విద్యార్థులకు 6 పేపర్లలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలో ఇవాళ్టి నుంచే ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇవాళ్టి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. పదవ తరగతి ఫలితాల నుంచే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. నేటి నుంచి 18వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version