నేలపై మోకరిల్లి నమస్కరించిన సీఎం చంద్రబాబు

-

CM Chandrababu: నేలపై మోకరిల్లి నమస్కరించారు సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో నేలపై మోకరిల్లి నమస్కరించారు సీఎం చంద్రబాబు నాయుడు. కాసేపటి క్రితమే ఉద్దండరాయుని పాలెం చేరుకున్న సీఎం చంద్రబాబు… నీరు-మట్టి సేకరించి ప్రదర్శనకు ఉంచిన ప్రాంతాన్ని సందర్శించారు.

CM Chandrababu knelt on the ground in the area where the foundation stone of the capital Amaravati was laid

సేకరించిన మట్టి గుట్టకు సాష్టాంగ ప్రణామం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు… కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. దీంతో జై అమరావతి, జై చంద్రబాబు నినాదాలు చేశారు అమరావతి రైతులు. అంతకు ముందు వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని ఏపీ సీఎం చంద్రబాబు తెలుసుకుంటున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన చంద్రబాబు.. తొలుత ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news