4.59 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్ లు అందించిన సీఎం జగన్

-

ఇవాళ బాపట్ల యడ్లపల్లిలో సీఎం జగన్‌ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యడ్లపల్లి హైస్కూల్‌లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు సీఎం జగన్‌. 4.59 లక్షల మంది విద్యార్థులు, 59,176 ఉపాధ్యాయులకు రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేశారు సీఎం జగన్‌.

అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ, నా పుట్టినరోజున నాకు ఎంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తు కోసం ఇంత అద్భుతమైన చేయగలుగుతున్నానని పేర్కొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు చెప్పారు సీఎం జగన్‌. మన కంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు.. కానీ, నా ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు తల్లి తండ్రులు పడుతున్న బాధలు చూశానని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుతోనే తలరాత మారుతుంది.. ఈ మూడున్నర ఏళ్ళల్లో పిల్లలు అందరూ బాగా చదవాలని దృష్టి పెట్టామన్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version