ఏపీలో సంక్షేమ పథకాలు ఆపింది చంద్రబాబే – సీఎం జగన్‌

-

ఏపీలో సంక్షేమ పథకాలు ఆపింది చంద్రబాబే అంటూ నిప్పులు చెరిగారు సీఎం జగన్‌. కోరుకొండ ప్రచార సభ వేదికపై సీఎం జగన్ మాట్లాడుతూ…. రాజానగరం సిద్ధమా… 12 అయింది ఇంత మండుటెండలో కూడా చిక్కటి చిరునవ్వు కనబడుతుందన్నారు సీఎం జగన్. మరో 6 రోజుల్లో జరగబోతుంది కురుక్షేత్ర మహా సంగ్రామం… రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని వివరించారు.


డిల్లీ పెద్దలతో చంద్రబాబు కుట్రలు పడుతున్నాడు…మీ పథకాలను ఆపేశాడని ఫైర్‌ అయ్యారు సీఎం జగన్‌. ఆఖరికి నేను కోర్టులో కేసు వేసేలా చేశాడు…వీళ్లు పథకాలను అడ్డుకున్నా.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు సీఎం జగన్.

మీ ఎంఎల్ఏ అభ్యర్ధి రాజా ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నానని చెప్పారు. నాకు సొంత తమ్ముడు లేదు అని భాద కలిగినప్పుడు రాజా ను చూస్తే నాకు సొంత తమ్ముడు వున్నాడు అనిపిస్తుందని వివరించారు సీఎం జగన్‌. అలాగే… మీ ఎంపీ అభ్యర్ధి శ్రీను అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నానని చెప్పారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version