వైసీపీ కీలక నేత మృతి.. పరామర్శించిన సీఎం జగన్‌

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ కృష్ణా జిల్లా పెడన మండలం కూడూరు పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేత ఉప్పాల రామ్‌ప్రసాద్‌ కుటుంబాన్ని పరామర్శించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌.

తీవ్ర అనారోగ్యంతో వైసీపీ నేత ఉప్పాల రామ్‌ప్రసాద్‌ కన్నుమూశారు. అయితే.. వైసీపీ నేత ఉప్పాల రామ్‌ప్రసాద్‌ నివాసంలో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం వైఎస్‌ జగన్‌… ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించారు. కాగా, కృష్ణా జిల్లా లో వైసీపీ కీలక నేతగా ఉప్పాల రామ్‌ప్రసాద్‌ పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version