కొబ్బరి ధర రికార్డు స్థాయిలో పెరిగింది. చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా కొబ్బరికి రికార్డు స్థాయిలో ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో దిగుబడి తగ్గడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొబ్బరికి డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో 1000 కొబ్బరికాయల ధర ఏకంగా రూ. 22 వేల నుంచి రూ. 23 వేల వరకు అమ్మకం అవుతుంది.

గత సంవత్సరం మే నెలలో ఈ ధర రూ. 12 వేల వరకు ఉండేది. ఇప్పుడు ఏకంగా సగం పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు అవుతుంది.