AP : విద్యార్థులకు అలర్ట్..ఇవాళ కళాశాలలు బంద్

-

ఏపీ వ్యాప్తంగా ఇవాళ జూనియర్ కాలేజీల బంద్ చేపడుతున్నట్టు ABVP ప్రకటించింది. జూనియర్ కాలేజీల్లో సమస్యల పరిష్కారం కోసం ఈ బంద్ చేపడుతున్నట్లు ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.

ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ కాలేజీల్లో కనీసం మౌలిక వసతులను కల్పించడం లేదన్నారు. వసతులు, పుస్తకాలు లేకుండా బోధన ఎలా సాగుతుందని ప్రశ్నించారు. కాగా, ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగానే ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news