IND VS WI : తొలి వన్డేలో వెస్టిండీస్‌పై భారత్ విజయం

-

IND VS WI : తొలి వన్డేలో వెస్టిండీస్‌పై భారత్ విజయం సాధించింది. వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఇషాన్ కిషన్(52) హాఫ్ సెంచరీతో రాణించగా… గిల్(7), సూర్య కుమార్(19), జడేజా(16*), రోహిత్(12*), హార్దిక్(5) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో గుడాకేష్ 2 వికెట్లు, సీల్స్, కరియా తలో వికెట్ తీశారు. కాగా… మరో రెండు వన్డేలు.. విండీస్ తో టీమిండియా ఆడనున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news