ఏపీలో భారీగా త‌గ్గిన కరోనా.. 100 లోపే కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి భారీగా త‌గ్గింది. రోజు రోజుకు క‌రోనా కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంది. కాగ కాసేప‌టి క్రితం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క‌రోనా బులిటెన్ ను విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్రకారం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 100 లోపే క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 12,916 శాంపిల్స్ ను ప‌రీక్ష చేయ‌గా.. కేవ‌లం 76 మందికే క‌రోనా వైర‌స్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది.

దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 23,18,338 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే ఈ రోజు కూడా రాష్ట్రంలో క‌రోనా కార‌ణంగా ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌లేదు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు.. 14,729 గానే ఉన్నాయి. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 266 మంది బాధితులు క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం కేవ‌లం 1,151 యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version