ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!

-

తిరుమలలో శ్రీవారి మహాప్రసాదంగా భావించే లడ్డూ కల్తీ జరిగిందనే గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. లడ్డూ కల్తీ వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తప్పై పోయిందని.. తమను క్షమించాలని స్వామి వారిని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 22న ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నంబూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ దీక్ష చేసిన పవన్ కల్యాణ్.. 11 రోజుల తరువాత ఇవాళ తిరుమలలో దీక్షను విరమించారు.

నిన్న సాయంత్రం రేణిగుంట ఎయిర్ ఫోర్ట్ నుంచి తిరుమలకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. కాలినడకన మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లారు. తన కుమార్తెలు ఆధ్య, పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం గొల్లమండపంలో పండింతులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు స్వామివారి చిత్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మంచి స్నేహితులు కావడంతో ఇవాళ పవన్ తో పాటు త్రివిక్రమ్ తిరుమలలో కనిపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version