విజయవాడలో డయేరియా మరణాలు…చంద్రబాబు సీరియస్‌

-

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరమన్నారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు చంద్రబాబు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని… దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు చంద్రబాబు.

డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదని పేర్కొన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని డిమాండ్‌ చేశారు బాబు. ఇక అటు టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో రానున్న స్థానిక ఎన్నికల్లో పోటీచేయనుంది టీడీపీ. నిన్న హైదరాబాద్‌లో టీటీడీపీ నాయకులతో సమావేశమైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకూ సమయం కేటాయిస్తానని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసేందుకు నేతలు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version