మచిలీపట్నంలో మైనర్ బాలికను లైంగిక వేధించాడు ఓ వృద్ధ ఉపాధ్యాయుడు. సెక్సువల్ ఫేవర్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. వేదింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి బాలిక పాల్పడింది. తల్లిదండ్రుల అప్రమత్తతో ప్రమాదం నుండి బయట పడింది బాలిక. కేసు నమోదు చేసి పది రోజులు గడుస్తున్నా ఉపాద్యాయుడిని అదుపులోకి తీసుకోలేదు పోలీసులు.

ఫోక్సో కేసు నమోదు చేసినప్పటికీ రాజీ కుదిర్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బాలికపై సెక్సువల్ వేదింపులకు పాల్పడిన వ్యక్తి తిక్కిసెట్టి నట దేవేంద్రరావు అలియాస్ నటరాజ్ మాస్టారుగా గుర్తించారు. 1983 నుండి 1995 వరకు మచిలీపట్టణం ప్రభుత్వ రాంజీ ఉన్నత పాటశాలలో పిటి మాస్టారుగా పనిచేసిన అనుభవం ఉంది. అప్పట్లో కూడా మహిళా టీచర్లను వేదించేవాడని సమాచారం అందుతోంది.
https://twitter.com/TeluguScribe/status/1928482977182573056