రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు.. క్లారిటీ ఇదే..!

-

మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ సమయత్వం అవుతోంది ఆ పార్టీ నేతలు కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 పార్లమెంటు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. ఆయా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఇక ఈసారి రాష్ట్రంలో బిజెపి పొందుకుంటుందని భావిస్తోంది. వచ్చే ఎన్నికలపై బీజేపీ దూకుడు పెంచింది.

ఇక ఈసారి ఎలాగైనా సరే సత్తా చాటాలనే ఉవ్విళ్లూరుతున్నారు.  ఆ పార్టీ అధిష్టానం కూడా రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. తొలుత అన్ని పార్లమెంటు నియోజకవర్గం బిజెపి కార్యాలయాలను ఏర్పాటు చేసింది. బూతు మండల జిల్లాల వారిగా కార్యకర్తలతో రాష్ట్ర నేతలతో కలిసి అగ్రనేతలు సమ్మేళనాలు నిర్వహించారు. అటు సంకల్ప యాత్రలు కూడా చేపట్టారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం వరుస కార్యక్రమాలు నిర్వహించారు. పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని ఇప్పటికే ఆమె స్పష్టం చేశారు. తాజాగా ఎన్నికలకు సంబంధించి కీలక విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు మరి వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version