తిరుపతిలో అగ్ని ప్రమాదం.. టీడీపీ విష ప్రచారంపై ఎమ్మెల్యే భూమన ఫైర్

-

తిరుపతి: రైల్వే స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఫోటో ఫ్రేమ్స్ తయారీ షాప్ లో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి సమీపంలో గోవిందరాజు స్వామి ఆలయ రథం ఉండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. శ్రీ గోవింద రాజస్వామి ఆలయం వద్ద లావణ్య ఫ్రేమ్స్ షాపులో మూడు ఫైరింజన్ లతో మంటలను అదుపు చేస్తున్నారు అధికారులు. సంఘటన ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఎమ్మేల్యే భూమన కరుణాకరరెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫైర్ ఇంజన్ అధికారులు సకాలంలో చేరుకుని మంటల్ని అదుపు చేస్తున్నారని తెలిపారు. టిడిపి నేతలు ఈ మంటల్లో చలి కాసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే భూమన. గోవింద రాజస్వామి ఆలయం రథం కాలిపోయిందని విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రథంకు , లావణ్య ఫ్రేమ్స్ దుకాణంకు చాలా దూరం ఉందని.. మంటలు చూసి చలి కాసుకునే విష సంస్కృతి టిడిపి నేతలదన్నారు. ఇది టిడిపి సానుభూతి పరుడి దుకాణమేనని.. దీన్ని మేము రాజకీయం చేయడం లేదు, మంటలు ఆర్పేందుకు సహాయం చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version