మేకప్ మీద కాదు..పర్యాటక శాఖపై దృష్టి పెట్టూ..రోజాపై టిడిపి ఎమ్మెల్సీ సెటైర్‌

-

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై టిడిపి ఎమ్మెల్సి మంతెన సత్యనారాయణ రాజు సెటైర్లు వేశారు. మంత్రి రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలు ఏపీని కించపరిచేలా ఉన్నాయని, రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీలో సినిమా షూటింగులు వద్దని చెప్పడానికి సెల్వమణి ఎవరు? అని ప్రశ్నించారు. టూరిజం అభివృద్ధి చేస్తానని మంత్రి రోజా అంటుంటే.. ఆమె భర్త మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రోజా భర్త వ్యాఖ్యలు దేనికి సంకేతమో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోజా కు మంత్రి పదవి వచ్చిన తర్వాత తన భర్తను లెక్క చేయడం లేదేమో అంటూ సెటైర్లు వేశారు. అందుకే రోజా కు వ్యతిరేకంగా, రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా సెల్వమణి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తన ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దుకోలేని రోజా ఇక రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఎం అభివృద్ధి చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. రోజా తన మేకప్ మీద పెట్టిన శ్రద్ధ లో కనీసం ఒక్క శాతం అయినా పర్యాటక శాఖ పై పెట్టాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version