2024లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయి :మండలి మాజీ చైర్మన్ షరీఫ్

-

ఏపీ ప్రభుత్వం పై మండలి మాజీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నీ పార్టీలు కాలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడాలని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడి ని ఓడించి తప్పు చేసాం అని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు…

45 శాతం ప్రజలు ఈ ప్రభుత్వం ని ఎన్నుకుని తప్పు చేసాం అని ఫీల్ అవుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం కి పరిపాలనా యోగ్యత లేదని ఫైర్ అయ్యారు. ప్రజా వ్యతిరేక ఓట్లు విడి పోకుండా పార్టీలు ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వామ పక్షాలు పార్టీలు ఏకం కావాలని… 2024 ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ది ని నిలబెట్టాలని ఆయన పేర్కొన్నారు.. పవన్ కళ్యాణ్ మీద కోపం తో సినిమా రంగం పై కగం మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష గట్టిందని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version