మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ వ్యాన్ లు రద్దు చేసి 20 వేల మంది యువకులను రోడ్డున పడేశారని పేర్కొన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. 20 వేల మంది యువకులతో ప్రభుత్వం అగ్రీమెంట్ చేసుకుందని పేర్కొన్నారు. వైసీపీపై చంద్రబాబుకు ఇంత కక్ష ఎందుకు ? అని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.

చంద్రబాబు హామీ ఇచ్చాడు అంటే అది నెరవేరదు అని అర్ధం అని పేర్కొన్నారు. అటు రేషన్ షాపుల పునఃప్రారంభంపై ఎక్స్ వేదికగా స్పందించారు మాజీ సీఎం వైఎస్ జగన్. పేదలకు మళ్లీ రేషన్ కష్టాలు తెస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇంటి దగ్గరకే వస్తున్న సేవలపై మీకెందుకు కక్ష? అని మండిపడ్డారు. వైసీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై దాదాపు 20 వేల మంది ఆధారపడ్డారన్నారు. వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం? అని నిలదీసారు వైఎస్ జగన్.