మిస్ ఇంగ్లాండ్ ను రేవంత్ రెడ్డి దోస్తులు ఇబ్బంది పెడితే పారిపోయింది – హరీష్

-

అందాల పోటీపై హరీష్ రావు హాట్ కామెంట్స్ చేసారు. జనుము, జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చేతగాని, దద్దమ్మ ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెడితే ఎవరి కడుపు నిండిందని ఆరోపణలు చేశారు. అణా పైసా అయినా సాయం జరిగిందని తెలిపారు.

HARISHRAO ON MISS INDIA
HARISHRAO ON MISS INDIA

ఇంగ్లాండ్లో ఉండే కంటెస్టెంట్‌ని రేవంత్ రెడ్డి దోస్తులు ఇబ్బంది పెడితే పారిపోయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. నీ విందు వినోదాల కోసం, అందాల భామలను చూడడానికి 5 సార్లు పోయావు అన్నారు. ఒక్క సారి కూడా ధాన్యం కొనుగోళ్లు చూసేది లేదా, జనుము జీలుగు విత్తనాలు ఉన్నయా లేవా అని చూసేది లేదా ? అని నిలదీశారు.

అనుచితంగా ప్రవర్తించి రాష్ట్ర, దేశ గౌరవాన్ని దెబ్బ తీసారు కాంగ్రెస్ నాయకులు అని ఫైర్ అయ్యారు. పోటీ నుంచి విరమించుకొని ఆమె దేశానికి పారిపోవడం అవమానకరం అన్నారు. మన రాష్ట్రానికి మచ్చ వచ్చేలా రేవంత్ రెడ్డి చేశాడు అంటూ నిప్పులు చెరిగారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news