ఉపాధ్యాయుడు కృష్ణ హత్య కేసులో నలుగురి అరెస్ట్

-

రాజాం మండలం కొత్త పేట వద్ద ఉపాధ్యాయుడు కృష్ణ హత్య కేసులో నలుగురిని అరెస్టు చేశారు విజయనగరం పోలీసులు. ఈ సందర్భంగా విజయనగరం ఎస్పీ దీపిక మాట్లాడుతూ.. వెంకటనాయుడుకి సహాకరించిన మోహన్, గణపతి, రామస్వామి హత్య చేశారని అన్నారు. తెర్లాం మండలం ఉద్దవోలులో వెంకట నాయుడు కుటుంబికులు నిర్మాణాలు చేశారని.. ఇందుకు రెండు కోట్లు అప్పు చేసి పెట్టుబడులు పెట్టడం, ఈ బిల్లులు ఇవ్వకుండా టీచర్ కృష్ణ అడ్డం పడుతున్నాడని హత్య చేశారని విచారణలో తేలిందన్నారు.

నిందితుడు వెంకటనాయుడుకి రాజకీయంగా కూడా టీచర్ కృష్ణ అడ్డుపడుతున్నాడని వీరంత హత్యకు ప్లాన్ చేశారని తెలిపారు. రెక్కి చేసి హత్య చేశారని అన్నారు. ఉదయం స్కూల్ టైమ్ లో వెంటపడి బొలెరాతో గుద్ది, తరువాత రాడ్డుతో కొట్టి చంపారని నిందితులు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులో ఉందన్నారు. ఎవ్వరూ ఆవేశాలకు వెళ్లవద్దని.. అనవసరంగా లా అండ్ ఆర్డర్ ని చేతులలోకి తీసుకోవద్దని హెచ్చరించారు. గ్రామంలో పోలీస్ పిక్కెట్టింగ్ కొనసాగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news