BREAKING : అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

-

ఏపీలో ఇటీవల పల్నాడులో జరిగిన బస్సు ప్రమాదం మరవకముందే మరో ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది. తాజాగా అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న  పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని సంగమేశ్వర్‌ నగర్‌కు చెందిన ఏడుగురు హైదరాబాద్‌ నుంచి అనంతపురం జిల్లాకు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో గుత్తికి 4 కిలోమీటర్ల దూరంలో రాయల్‌ దాబా వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ ఈ కారును ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో పదేళ్ల వయసు ఉన్న ఇద్దరు చిన్నారులు సహా మరో ఇద్దరు గుత్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటనపై గుత్తి సీఐ వెంకట్రామిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డ్రైవర్‌ నిద్ర మత్తే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version