పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న 144 సెక్షన్

-

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్.కొనసాగుతోంది. పోలింగ్ డే, ఆ తర్వాత జరిగిన హింసపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. గురజాల నియోజక వర్గంలో మొత్తం 192 మంది మీద కేసులు నమోదు అయ్యాయి. దాచేపల్లి మండలంలో 70 మంది మీద కేసులు నమోదు ( కేసానుపల్లి, నడికుడి, ఇరికెపల్లి, మాదినపాడు, దాచేపల్లి, ముత్యాలంపాడు గ్రామాల్లో గొడవలు జరిగాయి ) అయ్యాయి.

Section 144 continues in Palnadu district

గురజాల మండలంలో ఇప్పటివరకు నమోదు చేసిన కేసులు 10 మంది( చర్లగుడిపాడు, దైద గ్రామాల్లో గొడవలు జరిగాయి )గా ఉన్నారు. మాచవరం మండలంలో 45 మంది మీద కేసులు నమోదు ( కొత్త గణేషునిపాడు, పిన్నెల్లి, మాచవరం గ్రామాల్లో గొడవలు జరిగాయి ) అయ్యాయి. పిడుగురాళ్ల మండలంలో 67 మంది కేసులు నమోదు (పెద్ద అగ్రహారం 30 మంది, కరాలపాడు 12 మంది, బ్రాహ్మణ పల్లి :25)అయ్యాయి. 307, 324, 323 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version