టీటీడీలో ఉద్యోగాల పేరుతో మోసం.. జనసేన కార్యాలయంలో ఫిర్యాదు

-

టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మాజీ మంత్రులు అనీల్ కుమార్ యాదవ్, రోజా చిక్కుల్లో పడ్డారు. వీరిద్దరిపై ఫిర్యాదులు భారీగానే వచ్చాయి. తాజాగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణలో భాగంగా బాధితులు జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవికి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా టీటీడీలో ఉద్యోగాలను ఇప్పిస్తామని చెప్పి మాజీ మంత్రులు అనీల్ కుమార్ యాదవ్, రోజా పేర్లతో గీతా మాధురి అనే ఓ మహిళ ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసినట్టు ఆరోపించారు.

దాదాపు 40 మంది వద్ద డబ్బులు తీసుకున్నట్టు సమాచారం. అప్పటి ఈవో ధర్మారెడ్డి సంతకాలతో ఐడీ కార్డులు, నియామక పత్రాలు ఇచ్చి మోసం చేసినట్టు జనసేన కార్యాలయంలో వారు ఫిర్యాదు చేశారు. ఈ మోసం పై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. తాము చెల్లించిన డబ్బులను తమకు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మరోవైపు తాను పని చేస్తున్న కంపెనీ తనతో పాటు చాలా మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని.. దాదాపు 6 నెలల కాలం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీ అనే మహిళ వినతి పత్రం అందజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version