ఏపీలో వారందరికి శుభవార్త.. ఒక్కో అకౌంట్‌లో నేడు రూ.10వేలు జమ

-

ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందించింది జగన్‌ సర్కార్‌. జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి..ఎమ్మిగనూరు వీవర్స్‌ కాలనీ వైడబ్ల్యూసీఎస్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. ఒక్కో అకౌంట్ లో రూ.10 వేలు జమచేస్తారు. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. కాగా, జగనన్న తోడు పథకం లబ్ధిదారులను తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వినతులు తీసుకునేందుకు గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version