ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు శుభవార్త.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..!

-

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు హామీలు అమలు చేసిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన హామీలను ఈ ఏడాది అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే మహిళలు, బీసీ, ఎస్సీ , ఎస్టీ  మైనార్టీ, దివ్యాంగులు , ట్రాన్స్ జెండర్ల కు శుభవార్త చెప్పింది.

అయితే వారి మూలధన పెట్టుబడి లో భాగంగా ప్లాంటు, యంత్రాలపై రాయితీని 35 నుంచి 45 శాతానికి పెంచింది. విద్యుత్ టారిఫ్లోనూ ప్రోత్సాహకాలు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. MSME లు నెలకొల్పే ఎస్సీ, ఎస్టీ లకు భూమి విలువలో 75 శాతం రాయితీ గరిష్ఠంగా రూ.25 లక్షలు  కల్పిస్తూ మరో జీవో ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news