తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ డిసెంబర్‌ దర్శన టికెట్లు విడుదల

-

తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ డిసెంబర్‌ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమలలో ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో డిసెంబర్ నెలకు సంభందించిన అంగప్రదక్షణ టోకేన్లు విడుదల కానున్నాయి. ఈ మేరకు టీటీడీ పాలక మండలి అధికారిక ప్రకటన చేసింది. ఇవాళ 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు విడుదల కానున్నాయి.

Good news for Tirumala devotees..December darshan tickets are released today

మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు ,వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల చేయనుంది. రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. అటు రేపు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. కాగా తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ తగ్గింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version