తల్లికి వందనం కింద ఒక్కరోజులో రూ. 10వేల కోట్ల లబ్ది ఓ రికార్డు సాధించిందని గొట్టిపాటి రవి అన్నారు. పాఠశాలలు ప్రారంభించిన రోజే విద్యార్థులకు కిట్ల పంపిణీ, పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. తలులకు చేకూరే లబ్ధి చూసి వైసీపీ ప్రభుత్వం ఓర్వలేక విష ప్రచారాలు చేస్తుందని రవి అన్నారు.

రంగులు, బొమ్మల పిచ్చితో గత పాలకులు విద్య వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, టీచర్ల నియామకంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని గొట్టిపాటి రవి పేర్కొన్నారు. కాగా, మరోవైపు ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో భోజన పథకాన్ని కూడా ప్రారంభించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.