పవన్‌ కళ్యాణ్‌ ఇల్లు కట్టుకునేందుకు 2 ఎకరాలు ఇవ్వనున్న వైసీపీ ఎమ్మెల్యే ?

-

పవన్‌ కళ్యాణ్‌ ఇల్లు కట్టుకునేందుకు భూమి ఇస్తానని వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సెటైర్లు పేల్చారు. పవన్ కల్యాణ్ ను ఎర్రగడ్డ ఆస్పత్రిలో వేయాలని..లేకపోతే పిచ్చి ముదురుతుందని భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్ కౌంటర్‌ ఇచ్చారు. పవన్ కామెంట్స్ చూస్తుంటే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుంది..ప్రజా రాజ్యం పార్టీ నాటి నుంచి పవన్ భాష ఏ రకంగా ఉందో అందరికీ తెలుసన్నారు.

grandhi srinivas

భీమవరం వచ్చి ప్రజలు నీ గురించి ఏమీ అనుకుంటున్నారో ఒక్కసారి పవన్ తెలుసుకోవాలి..నీ అభిమానులకు సెల్ఫీ దిగే అవకాశం కూడా లేదు.. అందుకే నీ నిజ స్వరూపం ఎవ్వరికీ తెలియడం లేదని ఫైర్‌ అయ్యారు భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్. 24 సీట్లకు పరిమితం అయ్యి చంద్రబాబు మోచేతి నీళ్ళు పవన్ కళ్యాణ్ తాగేందుకు సిద్ధం అయ్యారు..24 సీట్లకు ఒప్పుకుని ఇప్పుడు 21 సీట్లు అంటున్నారని ఫైర్‌ అయ్యారు. పవన్ కల్యాణ్ నుమంచి మానసిక వైదుడుకి, ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించాలని అనే అనుమానం వస్తుందని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news