సాయిబాబు మృతదేహం… గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఉద్రిక్తత!

-

గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద గందరగోళం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నిమ్స్ మార్చూరి నుండి గన్ పార్క్ అమరవీర్ల స్తూపం చేరుకుంది సాయిబాబా పార్థివదేహం. ఈ తరుణంలోనే… సాయిబాబా పార్థివ దేహానికి నివాళులు అర్పించారు పలువురు విరసం నేతలు పౌర హక్కుల సంఘం ప్రజాసంఘాల నేతలు.

ఇదే సమయంలో సాయిబాబా మృతదేహాన్ని గన్ పార్క్ వద్ద నుండి వెంటనే తరలించాలని సైఫాబాద్ ఏసిపి సంజయ్ కుమార్ హుకుం జారీ చేశారు. దీంతో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు విరసం & హక్కుల సంఘం నేతలు. పదినిమిషాల పాటు అమరవీరుల స్థూపం వద్ద ఉంచి నివాళులర్పించి తీసుకువెళ్తామని పేర్కొన్నారు కుటుంబ సభ్యులు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version