తాతాజీ అంటూ.. అయ్యన్న పై హోంమంత్రి అనిత పొగడ్తలు..!

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అసెంబ్లీలో మాట్లాడారు. తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడగా.. ఆ తరువాత ఒక్కొకక్కరుగా మంత్రులు మాట్లాడారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆనందకరమని తెలిపారు. ఉత్తరాంధ్ర టైగర్ అయ్యన్న పాత్రుడు.. అక్రమ కేసులు పెట్టి బెదిరించినా ఎదురొడ్డి నిలబడ్డారు. మా తాతాజీ. సామాన్యుడికి అతి దగ్గరగా నిలిచిన వ్యక్తి అయ్యన్న. గత ఐదేళ్లు రాష్ట్రం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. సంప్రదాయాలకు విలువనిచ్చే పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. అయ్యన్న చాలా సీనియర్ అని.. ఆయన మాకు ఎంతో స్ఫూర్తి అని కొనియాడారు మంత్రి అనిత. పార్టీలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ విధి, విధానాలు అందరికీ వివరించడంలో చాలా దిట్ట అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version