Home Minister Anitha : బాధితురాలు శిరీషను ఫోన్ లో పరామర్శించారు హోం మంత్రి అనిత..కుప్పం ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనిత. నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని భరోసా కల్పించారు. ఇక అటు కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయింది.

మహిళను కట్టేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని పోలీసులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
బాధితురాలు శిరీషను ఫోన్ లో పరామర్శించిన హోం మంత్రి అనిత..
ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్న అనిత
నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని భరోసా https://t.co/59mSU9XCj6 pic.twitter.com/VTT4f1sKZl
— BIG TV Breaking News (@bigtvtelugu) June 17, 2025