ఆస్తి పన్ను బకాయిదారులకు గుడ్‌ న్యూస్‌

-

ఆంధ్రప్రదేశ్ లో పేరుకు పోయిన కోట్లాది రూపాయల ఆస్తి పన్ను బకాయిల వసూళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముప్పు తిప్పలు పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ బకాయిలు వసూళ్లు చేసేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆస్తి పన్ను బకాయిదారులకు తీపి కబురు చెప్పింది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ పురపాలకశాఖ నిర్ణయం తీసుకుంది.

భవనాలు, ఖాళీ స్థలాలపై ప్రస్తుత సంవత్సరం చెల్లించాల్సిన మొత్తంతో పాటు, పాత బకాయిలపై వడ్డీని 50 శాతం మేర మాఫీ చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 మార్చి 31వ తేదీలోగా చెల్లించే బకాయిలకు మాత్రమే 50 శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ మంగళవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పేరుకు పోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news