Jagan: నేడు కడపలో జగన్ ప్రజా దర్భార్

-

Jagan Praja Darbhar today in Kadapa: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్. తన క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రజలు, పార్టీ శ్రేణులకు జగన్ భరోసా కల్పించనున్నారు.

Jagan Praja Darbhar today in Kadapa

అలాగే రేపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. అయితే.. నిన్న వైఎస్ జగన్ పులివెందులకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన కారు దిగి ఇంట్లోకి వెళ్లిపోతున్న సమయంలో ఓ వ్యక్తి జగన్ మీదకు దూసుకొచ్చాడు. వెంటనే భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పక్కకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సదరు వ్యక్తి.. జగన్‌ను కలవడానికి వచ్చినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version