కొడాలి నానికి రోజులు దగ్గరపడ్డాయి – జనసేన నేతలు

-

కృష్ణాజిల్లా: ఎమ్మెల్యే కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గుడివాడ జనసేన నేతలు. కృష్ణా జిల్లా జనసెన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ.. ఆంబోతులా మాట్లాడుతున్న కొడాలి నానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు కొడాలి నాని ఎన్ని ట్రిక్కులు చేసినా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని తెలిపారు. 2024తర్వాత కొడాలి నాని పకోడీ, జంతికలు వేసుకొనే బతకాలని ఎద్దేవా చేశారు.

చిరంజీవి అభిమానుల దెబ్బకు కొడాలి నాని కాళ్ల బేరానికి వచ్చాడన్నారు. శాంతియుతంగా నిరసన చేసిన చిరంజీవి అభిమానులు 16 మందిపై కేసులు పెట్టించిన కొడాలి నాని ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భూ కబ్జాలు, దోపిడీ తప్ప ప్రజలకు ఏం చేసావో చెప్పాలనీ కొడాలి నానిని నిలదీశారు జనసేన నేతలు. అడ్డు అదుపు లేకుండా మోరిగితే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version