నా మద్దతు తీసుకోకుంటే.. ఏపీకి ఒక్క కంపెనీ రాదు – కేఏ పాల్‌ సంచలనం

-

నా మద్దతు తీసుకోకుంటే.. ఏపీకి ఒక్క కంపెనీ రాదంటూ కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేఏ పాల్‌ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలలోగా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురాగలనని తెలిపారు. చంద్రబాబు ఏపీ సీఎం కాబట్టి లాస్ ఏంజెల్సులో జరిగే గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ వస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని…. ఎఫ్సీఆర్ఏ ఇస్తే నా ట్రస్ట్ ద్వారా నెల రోజుల్లో రూ. 8 వేల కోట్లు తెస్తానని ప్రకటించారు.


విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా జస్టిస్ శేషసాయి చక్కటి తీర్పు ఇచ్చారని… ఖజానాలో డబ్బుల్లేవని.. హామీలు అమలు చేయలేమని చంద్రబాబుకు ఎప్పుడో తెలుసు.. కానీ ఓట్లు పడవని చెప్పలేదన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖజానా గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని… విశాఖలో జరిగిన సదస్సులో సూట్ బూట్ వేయించి నూడుల్స్ అమ్ముకునే వాడితో ఒప్పందం చేసుకున్నారని ఆగ్రహించారు. నేను ప్రపంచ కుబేరులను రాష్ట్రానికి తెచ్చాను….కేరళకు కొన్ని పెట్టుబడులు ఇప్పించానని తెలిపారు. నేను చంద్రబాబును కలవడానికి సిద్దం.. నన్ను కలవడానికి చంద్రబాబు సిద్దమా..?ఎన్డీఏకు మద్దతిచ్చే సందర్భంలోనే చంద్రబాబు కొన్ని డిమాండ్లు పెట్టి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version