చంద్రబాబు నుంచి పవన్‌కు రూ.1500 కోట్లు తీసుకున్నారు : KA పాల్

-

చంద్రబాబు నుంచి పవన్‌కు రూ.1500 కోట్లు తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు KA పాల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రవాక్యాలు చేశారు. ‘పవన్ ప్యాకేజీ స్టార్. రూ.1500 కోట్లు చంద్రబాబు నుంచి ముట్టాయి. దుబాయ్, హాంకాంగ్, సింగపూర్ లో ట్రాన్స్ఫర్ అయ్యాయి.

25 సీట్లకే పరిమితం కావాలని…. టిడిపితో పొత్తుకు సిద్ధం కావాలని మనోహర్ ప్రకటించారు. బిస్కెట్లకు అమ్ముడుపోవడానికి కుక్కలమా? అని పవన్ గతం లో అన్నారు. ఇప్పుడేమంటారు?’ అని పాల్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వదిలి నారా యాత్ర చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. 15 సీట్లకు అమ్ముడుపోయాడని… 175 స్థానాల లో ప్రజాశాంతి పార్టీలాగా పోటీ చేసే దమ్ము ఉందా అని నిలదీశారు. పప్పును సిఎం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని… చంద్రబాబు కావాలని… కొందురు మూర్ఖులు కోరుకుంటు న్నారని నిప్పులు చెరిగారు కేఏ పాల్. రెండు రాష్ట్రాలలో పాలకులు విఫలమయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version