దర్శకుడు రాంగోపాల్ వర్మపై కాపు సంఘాల ఆగ్రహం

-

గత ఆదివారం రోజున హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే వీరి భేటీని ఉద్దేశించి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘ రిప్ కాపులు.. కంగ్రాచులేట్స్ కమ్మోళ్ళు” అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం పెద్ద దుమారంగా మారింది.

కాపు సామాజిక వర్గాన్ని కించపరిచేలా రాంగోపాల్ వర్మ ట్వీట్ ఉందని ఆగ్రహిస్తున్నారు. కాపుల పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాంగోపాల్ వర్మపై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గుంటూరు మార్కెట్ సెంటర్ లో రాంగోపాల్ వర్మకు అశ్రునివాళి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాపు నాయకులు. అంతేకాక రాంగోపాల్ వర్మ పెద్దకర్మ పేరుతో అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు వర్మ మీద పోలీసు కేసు పెట్టాలని కాపు జేఏసీ నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version