కేశినేని నాని ఓ ఊసరవెల్లి…టీడీపీలో ఉండి వైసీపీ కోసం పనిచేశాడు- కేశినేని చిన్ని

-

టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని ఊసరవెల్లి అని.. టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం కేశినేని నాని పని చేశాడని ఆగ్రహించారు.ఢిల్లీలో లోకేష్ ఏయే లాయర్లను కలిశారు.. ఎవరెవరితో మాట్లాడుతున్నారనే విషయాన్ని వైసీపీ చేరవేశారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు కోసం పూజలు చేసిన కేశినేని నాని.. ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నాడని మండిపడ్డారు.

విజయవాడ వెస్టులో టిక్కెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి దగ్గర నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారు…తామిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని నానిపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. కేశినేని నాని కాల్ రికార్డ్స్ ఉన్నాయి…..కేశినేని నాని వసూలు రాజా అంటూ నిప్పులు చెరిగారు.

నన్ను పిట్టల దొర అంటున్న కేశినేని నాని విషయాన్ని త్వరలో ప్రజలే తేలుస్తారని హెచ్చరించారు. జగన్ వద్ద.. వైసీపీ ఇన్చార్జుల వద్ద కేశినేని నాని పాలేరు పని చేస్తున్నారు….కేశినేని నానిది సైకో మనస్తత్వమని ఆగ్రహించారు. విజయవాడ ఎంపీ టిక్కెట్ కేశినేని నానికి ఇవ్వడం జగనుకు ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version