దసరా పండుగకు ముందే అందుబాటులోకి మద్యం షాపులు : కొల్లు రవీంద్ర

-

దసరా పండుగకు ముందే మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయి అని మందుబాబులకు ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర గుడ్ న్యూస్ చెప్పారు. గత ప్రభుత్వం మద్యం పాలసీ ద్వారా దోపిడీ చేసింది. ప్రభుత్వ పరివేక్షనలో ప్రైవేట్ షాప్స్ నిర్వహణ జరిగేలా నిర్ణయం తీసుకున్నాం. రెండు రోజుల్లో షాపుల ఏర్పాటుపై గైడ్ లైన్స్ ఇస్తాం. ఏ జిల్లాలో ఎన్ని షాపులు అనే వివరాలు వస్తాయి. 7 రోజుల పాటు దరఖాస్తులు చేసుకోవచ్చు. మధ్యలో 2 రోజులు సెలవులు వస్తున్నాయి. పదో రోజున డ్రా తీస్తాం. ఒక దరఖాస్తు ఫీజు 2 లక్షలు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులు ఎన్నైనా వేయవచ్చు.

డ్రాలో పేర్లు వచ్చిన వారు లైసెన్స్ ఫీజులు 4 స్లాబులో రకాలుగా ఉన్నాయి. స్లాబులు ఏరియా బట్టి నిర్ణయం ఉంటుంది. ఇవి 6 వాయిదాలలో కట్టుకోవాలి. అన్ని బ్రాండ్లు అందే విధంగా పారదర్శకంగా అందిస్తున్నాం. 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని సామాన్యులకు అందిస్తున్నాం. గత ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్ మెంట్ వారిని సెబ్ పేరుతో విడగొట్టారు. ఇప్పుడు రెండింటినీ కలుపుతూ నిర్ణయం తీసుకున్నాం అని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version