కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన ఆరోపణలు..నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు…!

-

నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారన్న నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. నా ఫోన్ 3 నెలల నుంచి ట్రాప్ చేస్తున్నారని ఆగ్రహించారు.

ఫోన్ ట్రాప్ చేస్తున్న విషయం నాకు ముందు నుంచి తెలుసు, రహస్యాలు మాట్లాడుకునేందుకు వేరే ఫోన్ ఉందని వెల్లడించారు. నాకు 12 సిమ్‌లు ఉన్నాయన్నారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్‌ని మీ పెగాసస్ రికార్డు చేయలేదని పేర్కొన్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా? అని ప్రశ్నించారు నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. లేదంటే నిఘా కోసం నా నియోజకవర్గంలో ఒక ఐపీఎస్ అధికారిని పెట్టుకోండి.. క్రికెట్ బెట్టింగ్ కేసులప్పుడు కూడా అప్పటి ఎస్పీ నాపై నిఘా పెట్టారని ఆరోపణలు చేశారు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version