బీజేపీ-టీడీపీ-జనసేన వీడిపోతే వైసీపీకి 132 సీట్లు వస్తాయి -ఎమ్మెల్యే నల్లపురెడ్డి

-

బీజేపీ-టీడీపీ-జనసేన వీడిపోతే వైసీపీకి 132 సీట్లు వస్తాయని పేర్కొన్నారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా కోవూరు లో వైసీపీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వై.సి.పి.గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయని… సి ఓటర్ సర్వేలో మాత్రం చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెబుతోందని ఆగ్రహించారు.

సి-ఓటర్ సర్వే చంద్రబాబు చెంచా..లాంటిది…నా సర్వే చెబుతున్నాను…బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి 117 సీట్లు వస్తాయని చెప్పారు. ఆ మూడు విడిపోతే 132 సీట్లు వైసీపీకి వస్తాయన్నారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు…రాసి పెట్టుకోండి ఈ సమావేశంలో నేను చెప్పిందే జరుగుతుందన్నారు. ఎన్ని శక్తులు ఒకటైనా సింహం సింగల్ గా వస్తుంది…ఎంతమంది కలిసి వచ్చినా జగన్ వెంట్రుక కూడా పీకలేరని తేల్చి చెప్పారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.
ఒక ఎమ్మెల్యేగా ఒక మాజీ మంత్రిగా ఎప్పుడూ నేను వ్యవహరించలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news