పల్నాడు అల్లర్లపై లావు శ్రీ కృష్ణ దేవరాయలు సంచలన ప్రకటన

-

పల్నాడు అల్లర్లపై టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు సంచలన ప్రకటన చేశారు. పల్నాడు అల్లర్లపై సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించాలన్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు. ఎస్పీ బిందు మాధవ్ కుటుంబానికి మాకు బంధుత్వం ఉందనే ప్రచారం చేస్తున్నారని… మాకు ఎస్పీ బిందు మాధవ్ కి ఎటువంటి బంధుత్వం లేదని వెల్లడించారు.

Lavu Sri Krishna Devaraya’s sensational statement on the Palnadu riots

నేను ఎప్పుడు ఎస్పీతో ఫోన్ కూడా మాట్లాడలేదు….అవసరమైతే నా కాల్ డేటా సిట్ అధికారులు పరిశీలించాలని డిమాండ్‌ చేశారు టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు. పల్నాడు అల్లర్లపై నా ప్రమేయం ఉంటే నా పేరు ఛార్జ్ షీట్లో పెట్టుకోవచ్చు…సమస్యాత్మక బూత్ లు ఉన్నాయి అని చెప్పినా అక్కడ ఒక కానిస్టేబుల్ ని మాత్రమే ఉంచారన్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version