కాంగ్రెస్‌ కు కర్రు కాల్చి పెట్టాలి…మళ్ళీ మోసపోవద్దు – కేటీఆర్‌

-

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కర్రు కాల్చి పెట్టాలి… ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోవద్దని కోరారు కేటీఆర్. భద్రాద్రి ఇల్లందులో పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌ మాట్లాడుతూ… తెలంగాణ లో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడడం లేదని..ఓట్లేసేటప్పుడు రేవంత్ రెడ్డి కి రైతు బంధు గుర్తుకు వస్తోందని ఫైర్ అయ్యారు. ఆరు నెలలు గడిచిన రైతు బంధు…రాలేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు కావాలి…ప్రభుత్వాన్ని ప్రశంసించేవి కాదని వెల్లడించారు.

KTR speaking in Bhadradri Illandu election campaign for graduates

ప్రభుత్వానికి మంద బలం వుంది…15 వేలు రైతు బంధు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.. ఇప్పటి వరకు ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలను పిచ్చోళ్ళ ను చేస్తున్న రేవంత్ రెడ్డి….ఆరు గ్యారంటీ లో ఒక్క గ్యారంటీ మాత్రమే అమలు చేశారని ఆగ్రహించారు. ఆ ఫ్రీ బస్ వల్ల మహిళలు, మగవాళ్ళు తిట్టుకుంటున్నారన్నారు. మొన్నటి స్వల్ప ఓటింగ్ తేడా తో brs ఓటమి చెందిందని… 14 సీట్ల లో ఓటమి పాలయ్యామన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ఉదరకొట్టింది కాంగ్రెస్ పార్టీ అని..
అరచేతిలో వైకుంఠం కాంగ్రెస్ చూపించిందని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version